పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-234-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదిగావున సూరిజనోత్తముండ వైన నీవు మదీయ మానసిక సంశ యంబులఁ దొలగింప నర్హుండవు" అని విదురుండు మైత్రేయమునీంద్రు నడిగె" నని బాదరాయఁతనూభవుం డభిమన్యునందనున కిట్లనియె

టీకా:

అదిగావున = అందుచేత; సూరి = పండితులైన {సూరి - పదునైన బుద్ధికలవాడు, పండితుడు}; జన = జనులలో; ఉత్తముండవు = ఉత్తమమైనవాడవు; ఐన = అయినట్టి; నీవు = నీవు; మదీయ = నాయొక్క; మానసిక = మనసులో కలిగిన; సంశయంబులన్ = అనుమానములను; తొలగింపన్ = తొలగించుటకు; అర్హుండవు = అర్హత కల వాడవు; అని = అని; విదురుండు = విదురుడు; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; ఇంద్రున్ =శ్రేష్ఠుని; అడిగెను = అడిగెను; అని = అని; బాదరాయ = వ్యాసుని {బాదరాయణుడు - బదరీవనవాసి, వేదవ్యాసుడు}; తనూభవుండు = పుత్రుడు; అభిమన్యు = అభిమన్యుని {అభిమన్యునందనుడు - పరీక్షిన్మహారాజు}; నందనున్ = పుత్రుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

ఈ నా మనస్సులోని సందేహాలను తొలగించడానికి విద్వాంసులలో అగ్రగణ్యుడవైన నీవే సమర్థుడవు” అని విదురుడు మైత్రేయుణ్ణి వేడుకున్నాడు” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.