పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-226-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రియుం దన మాయాగతిఁ
రికించియుఁ గానడయ్యె రిమితి లేమిన్
ఱి మాయా వినిమోహిత
రితముఁ గనుఁగొందు రెట్లు తురాస్యాదుల్.

టీకా:

హరియున్ = హరి కూడ; తన = తన; మాయన్ = మాయ; గతిన్ = విధామును; పరింకించియున్ = విచారించినను; కానడు = తెలిసికొనలేడు; అయ్యెన్ = ఆయెను; పరిమితి = అవధి; లేమిన్ = లేకపోవుటచేత; మఱి = మరియును; మాయా = మాయ యొక్క; వినిమోహిత = మిక్కిలి మోహింపజేయు; చరితమున్ = వర్తనమును; కనుగొందురు = తెలిసికొనగలరు; ఎట్లు = ఏనిధముగా; చతురాస్య = బ్రహ్మదేవుడు {చతురాస్యుడు - నాలుగు (చతుర) ముఖము (అస్యము)లవాడు, బ్రహ్మదేవుడు}; ఆదుల్ = మొదలగువారు.

భావము:

ఓ మహానుభావా! విదురా! ఆ హరికూడా అనంతమైన తన మాయావ్యవహారాన్ని అవగాహనం చేసుకోలేక పోయాడంటే మాయావిని అయిన ఆ మహామోహుని ప్రభావం బ్రహ్మాదులకు మాత్రం ఎలా అంతుపట్టుతుంది.