పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-217-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁ బ్రాహ్మణాదికముఁ ద
స్కబాధలఁ బొందకుండఁ గైకొని కావం
బురుషోత్తము బాహువులన్
నాథకులంబు పుట్టె యతత్త్వనిధీ!

టీకా:

ధరన్ = భూమిమీద; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; ఆదికము = వర్గము; తస్కర = దొంగల; బాధలన్ = బాధలను; పొందకుండన్ = పొందకుండ ఉండుటకై; కైకొని = సంకల్పించి, చేపట్టి; కావన్ = కాపాడుటకు; పురుషోత్తమున్ = పురుషోత్తముని; బాహువులన్ = చేతులను; నరనాథ = రాజుల {నరనాథుడు - నరులకు ప్రభువు, రాజు}; కులంబు = వంశములు; పుట్టె = పుట్టెను; నయ = న్యాయము; తత్త్వ = తత్త్వములకు; నిధీ = నిధివంటివాడా.

భావము:

ఓ నీతి విద్యావిశారదుడవైన విదురా! బ్రాహ్మణాది వర్ణాల వారు దొంగలూ దుండగులూ మొదలైన వారి వల్ల బాధలు పొందకుండా వారిని రక్షించడానికే ఆ పురుషోత్తముని భుజాల నుండి క్షత్రియజాతి జన్మించింది.