పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-216-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీదివిజులు శ్రుతులును
వర యమ్మేటి ముఖమునం బొడముట భూ
సురుఁ డఖిల వర్ణములకున్
గురుఁడున్ ముఖ్యుండు నయ్యె గుణరత్ననిధీ!

టీకా:

ధరణీదివిజులు = బ్రాహ్మణులు {ధరణీదివిజులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; శ్రుతులును = వేదములును; నరవర = రాజా {నరవరుడు - నరులకు ప్రభువు, రాజు}; ఆ = ఆ; మేటి = గొప్పవాని; ముఖమునన్ = ముఖమునుండి; పొడముటన్ = పుట్టుటచే; భూసురుడు = భ్రాహ్మణుడు {భూసురుడు - భూమికి దేవత, బ్రాహ్మణుడు}; అఖిల = సమస్తమైన; వర్ణముల = జాతుల; కున్ = కిని; గురుడున్ = గురువును; ముఖ్యుండున్ = ముఖ్యమైనవాడును; అయ్యెన్ = అయ్యెను; గుణ = (మంచి) గుణములు అను; రత్న = రత్నములకు; నిధీ = నిధివంటివాడు.

భావము:

ఓ ప్రశస్త గుణసంపన్నుడవైన పరీక్షిన్మహారాజా! బ్రాహ్మణులూ, వేదాలూ ఆ విరాట్ పురుషుని ముఖం నుండి పుట్టడం వల్ల బ్రాహ్మణుడు సమస్త వర్ణాలకు జ్యేష్ఠుడూ, శ్రేష్ఠుడు అయ్యాడు.