పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

3-2-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె: "అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

టీకా:

మహనీయ = గొప్ప; గుణ = గుణములు గల వారిలో; గరిష్ఠులు = ఉత్తములు; అగు = అయినట్టి; ఆ = ఆ; ముని = యోగులలో; శ్రేష్ఠులు = గొప్పవారల, శౌనకాదుల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = సవివరముగ చెప్పు; వైఖరీ = నేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయినట్టి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆ విధముగ; పరీక్షిత్ = పరీక్షత్తు అను; నర = మానవులకు; ఇంద్రుడు = ప్రభువు, మహారాజు; కున్ = కి; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

పురాణాలు సమస్తము చక్కగా వివరించడంలో విశిష్ఠమైన నేర్పు గల సూతమహర్షి ఉత్తమ గుణసమేతులైన శౌనకాది మునీశ్వరులకు “శుకముని పరీక్షిన్నరేంద్రునికి ఇలా చెప్పసాగాడు” అంటూ ఇలా చెప్పసాగాడు.