పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : పూర్ణి

  •  
  •  
  •  

2-286-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రేంద్రసుతవిదారణ!
లాప్తతనూజరాజ్యకారణ! భవసం
సదినేశ్వర! రాజో
త్త! దైవతసార్వభౌమ! శరథరామా!

టీకా:

అమరేంద్ర = దేవంద్ర; సుత = పుత్రుని (వాలిని); విదారణ = చంపినవాడ; కమల = కమలములకు; ఆప్త = ఆప్తుడు (సూర్యుని); తనూజ = పుత్రుని (సుగ్రీవుని); రాజ్య = రాజ్య ప్రాప్తికి; కారణ = కారణమైనవాడ; భవ = సంసారము అను; సం = మిక్కిలి; తమస = చీకటికి; దిన = దినమునకు; ఈశ్వర = ప్రభువ (సూర్యుడ); రాజ = రాజులలో; ఉత్తమ = ఉత్తముడ; దైవత = దేవతలకు; సార్వభౌమ = చక్రవర్తి యైనవాడ; దశరథ = దశరథుని; రామ = రాముడ.

భావము:

శ్రీరామచంద్ర ప్రభువ! దశరథ పుత్రుడ! నీవు దేవేంద్రుని కొడుకు, మహాబలశాలి అయిన వాలిని సంహరించినవాడవు, సాక్షాన్నారాయణుడైన సూర్యభగవానుని పుత్రుడు సుగ్రీవునికి రాజ్యాధికారం దక్కుటకు కారణభూతుడవు, సూర్యుడు చీకటిని పారదోలునట్లు సంసారమనే తమస్సు సర్వం తొలగించువాడవు, ప్రభువు లందరిలోను మేలైన దివ్యసార్వభౌముడవు.