పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

  •  
  •  
  •  

2-215-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాక్షు మహిమ నిత్యము
వినుతించుచు; నొరులు వొగడ వినుచున్; మదిలో
నుమోదించుచు నుండెడు
ములు దన్మోహవశతఁ నరు మునీంద్రా!"

టీకా:

వనజాక్షు = వనజాక్షుని {వనజాక్షుడు - వన (నీటి) లో జ (పుట్టునది) పద్మము వంటి అక్షుడు (కన్నులు ఉన్నవాడు)}; మహిమన్ = మహిమను; నిత్యమున్ = ప్రతి నిత్యము; వినుతించుచున్ = స్తోత్రము చేయుచు; ఒరులున్ = ఇంకొకరు; పొగడన్ = స్తుతించు చుండగ; వినుచున్ = వింటూ; మదిలోన్ = మనసులో; అనుమోదించు = సంతోషముతో; ఉండెడు = ఉండునట్టి; జనములున్ = మానవులు; తత్ = ఆ; మోహ = మోహమునకు; వశతఁన్ = వశమగుట వలన; చనరు = విడిచి వెళ్ళలేరు; ముని = మునులలో; ఇంద్రా = ఇంద్రుడా.

భావము:

నారదమునిశ్రేష్ఠ! ఎల్లవేళలా కమలనయనుని మహిమను స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ వుంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసే వాళ్లు దేవుని మాయకు లోనుగారు.”