పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-156-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్రముగ భరత లక్ష్మణ
త్రుఘ్నుల కర్థి నగ్రన్ముం డగుచున్
ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ
విత్రుఁడు దుష్కృత లతా లవిత్రుం డగుచున్.

టీకా:

చిత్రముగ = చిత్రముగ; భరత = భరతుడు; లక్ష్మణ = లక్ష్మణుడు; శత్రుఘ్నులన్ = శత్రుఘ్నుల; కున్ = కి; అర్థిన్ = కోరి; అగ్ర = అన్నగ (ముందు); జన్ముండు = పుట్టినవాడు; అగుచున్ = అగుచు; ధాత్రిన్ = భూమిమీద; రాముఁడు = రాముడు; వెలసెఁన్ = అవతరించెను; పవిత్రుఁడు = పవిత్రమైనవాడు; దుష్కృతన్ = పాపములు అను; లతా = లతలకు; లవిత్రుండు = కొడవలి వంటివాడు; అగుచున్ = అగుచు.

భావము:

ఆ శ్రీరామచంద్రునిగా అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు.