పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

  •  
  •  
  •  

2-129-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నారాయణు లున్న చోటికి మరున్నారీ సమూహంబు భా
స్వలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ
రిహాసోక్తుల నాటపాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్
రితధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.

టీకా:

నర = నరుడు; నారాయణులు = నారాయణులు; ఉన్న = అన్నట్టి; చోటికిన్ = స్థలమునకు; మరున్ = దేవ; నారీ = రమణుల; సమూహంబున్ = సమూహము; భాస్వర = ప్రకాశించు; లీలన్ = లీలతో; చని = వెళ్ళి; రూప = రూపము; విభ్రమము = శృంగార భంగిమల; కళా = కళలోని; చాతుర్యమున్ = నేర్పరితము; ఏపారగాన్ = అతిశయింపగ; పరిహాసోక్తులన్ = పరిహాసపుమాటల; ఆట = ఆటలు; పాటలన్ = పాటలుతో; చరింపన్ = తిరుగుతుండగ; చూచి = చూసి; నిశ్చింతతన్ = నిశ్చింతగా; భరిత = నిండు; ధ్యానన్ = ధ్యానముతో కూడిన; తపః = తపస్సు యొక్క; ప్రభావన్ = మహిమందు; నిరతిన్ = మిక్కిలి ఆసక్తి; పాటించి = పాటిస్తూ; నిష్కాములు = కోరికలు లేని వారు; ఐ = అయి.

భావము:

అక్కడ నరుడు, నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి దేవకాంతలు సవిలాసంగా వచ్చారు. అందచందాల తీరు, కళానైపుణ్యాల సౌరు ఉట్టిపడేలా పరాచికాలాడుతు, ఆటలాడుతూ, పాటలు పాడుతూ విహరించారు. అలా విలాసలీలలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నరనారాయణులు చూసారు. కాని ఏ మాత్రం చలించలేదు. కామానికి లోను కాలేదు. నిశ్చింతులై, నిర్మోహులై వాళ్లు అలాగే నిరతిశయ నిశ్చల ధ్యానంతో మహా తపస్సుతో నిమగ్నులై ఉండిపోయారు.