పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

  •  
  •  
  •  

2-127-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రావించి తపోవిఘ్నముఁ
గావింపుం డనుచు బనుపఁ డు వేడుకతో
భాభవానీకిను లనఁ
గా నితలు సనిరి బదరికావనమునకున్.

టీకా:

రావించి = పిలిపించి; తపస్ = తపస్సునకు; విఘ్నమున్ = ఆటంకమును; కావింపుడు = చేయండి; అనుచున్ = అనుచు; పనుపన్ = నియోగించగ; కడు = మిక్కిలి; వేడుకన్ = వేడుక; తోన్ = తో; భావభవ = మన్మథుని {భావభవుడు - (కామ) భావములను పుట్టించు వాడు, మన్మథుడు}; అనీకినులు = సైనికులు; అనఁగా = అన్నట్లుగ; వనితలు = (దేవ) రమణులు; సనిరి = వెళ్ళిరి; బదరికా = బదరిక {బదరిక - రేగుపళ్ళు}; వనమున్ = ఆశ్రమము; కున్ = నకు.

భావము:

అలా పిలిపించి నరనారాయణుల తపస్సు భగ్నం చేయమని ఇంద్రుడు పంపగా, అప్సరసలు ఎంతో సంతోషంతో కంతుని చతురంగసేనలా అన్నట్లు బయలుదేరి బదరీవనానికి వెళ్ళారు.