పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : పరమాత్ముని లీలలు

  •  
  •  
  •  

2-111-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సగతిన్ మునీంద్రులు ప్రన్నశరీరహృషీకమానస
స్ఫుణ గలప్పు డవ్విభుని భూరికళాకలితస్వరూపముం
మిడి చూతు; రెప్పుడుఁ గుర్క తమోహతిచేత నజ్ఞతం
బొసిన యప్పు డవ్విభునిమూర్తిఁ గనుంగొనలేరు నారదా!"

టీకా:

సరస = చక్కటి; గతిన్ = విధముగ; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ప్రసన్న = నిర్మలమైన; శరీరమున్ = దేహమును; హృషీకన్ = ఇంద్రియములును; మానసన్ = మనస్సు; స్ఫురణన్ = స్ఫురణలు; కలప్పుడు = కలిగినప్పుడు; ఆ = ఆ; విభుని = ప్రభువు, భగవంతుని; భూరి = అనంతమైన; కళా = కళలతో; కలిత = కూడిన; స్వరూపమున్ = స్వరూపమును; తరిమిడి = శ్రీఘ్రమే; చూతురు = దర్శింతురు; ఎప్పుడున్ = ఎప్పుడైతే; కుతర్కన్ = కుతర్కము అనే; తమస్ = చీకటి; హతిన్ = కమ్ముట; చేతన్ = చేత; అఙ్ఞతన్ = అఙ్ఞానము అను; పొరసినన్ = కలిగిన; అప్పుడున్ = అప్పుడు; ఆ = ఆ; విభుని = ప్రభువు, భగవంతుని; మూర్తిన్ = స్వరూపమును; కనుంగొనన్ = తెలిసికొన; లేరు = లేరు; నారదా = నారదుడా.

భావము:

నారదమునీశ్వరా! మునీశ్వరులు తమ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్ముని మహితకళావిలసితమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు కుతర్కము అనే తమస్సు కమ్ముకుని అజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ దేవుని స్వరూపం గుర్తించలేరు.”