పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : లోకంబులు పుట్టుట

  •  
  •  
  •  

2-87-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భునాత్మకుఁ డా యీశుఁడు
నాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్
విరముతోఁ బదునాలుఁగు
విరంబులుగా నొనర్చె విశదంబులుగన్

టీకా:

భువన = భువనములు; ఆత్మకున్ = తానే అయినవాడు; ఆ = ఆ; ఈశుఁడు = ఈశ్వరుడు, అధికారి; భవన = భవనములు యొక్క; ఆకృతి = ఆకారము; తోడన్ = తో; ఉండు = ఉండెడి; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; వివరము = వివిధ లక్షణములు; తోన్ = తో; పదునాలుగు = పద్నాలుగు; వివరంబులుగాన్ = రకములుగా; ఒనర్చెన్ = చేసెను; విశదంబుగన్ = విశదమగునట్లు, తెలియునట్లు.

భావము:

ప్రపంచ స్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఒక భవనం లాగ ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగాచేసి విపులమైన చతుర్దశభువనాలుగా తీర్చిదిద్దాడు.