పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : హరిభక్తిరహితుల హేయత

  •  
  •  
  •  

2-53-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుతుల హితుల విడిచి, చుట్టాల విడిచి, యి
ల్లాలి విడిచి, బహు బలాళి విడిచి
రాజు హృదయ మిడియె రాజీవనయనుపై
నము విడిచి, జడ్డుఁనము విడిచి.

టీకా:

సుతులన్ = సంతానమును; హితులన్ = సన్నిహితులను; విడిచి = విడిచిపెట్టి; చుట్టాలన్ = బంధువులను; విడిచి = విడిచిపెట్టి; ఇల్లాలిన్ = భార్యను; విడిచి = విడిచిపెట్టి; బహు = అనేకమైన; బల = బలగముల, పరిజన; ఆళిన్ = సమూహములను; విడిచి = విడిచిపెట్టి; రాజు = రాజు, పరీక్షిన్మహారాజు; హృదయము = మనసు; ఇడియెన్ = పెట్టెను; రాజీవనయనున్ = పద్మనేత్రుని, విష్ణుని; పైన్ = మీద; ధనమున్ = సంపదలను; విడిచి = విడిచిపెట్టి; జడ్డున్ = మందత్వము; తనమున్ = కలిగి ఉండుటను; విడిచి = విడిటిపెట్టి.

భావము:

ఆ రాజు పరీక్షిత్తు బిడ్డలను, హితులను, బంధువులను, భార్యను, ఇతర పరిజనాన్ని, ధనాన్ని, జడత్వాన్ని వదలిపెట్టి పద్మాక్షుడైన భగవంతుని మీద మనస్సు నిలిపాడు.