పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : రాజుల యుత్పత్తి

  •  
  •  
  •  

12-6-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పతులమహిమ నంతయు
నుగాధిపుఁ డైన నొడువ నోపఁడు; ధాత్రిం
జికాల మేలి యిందే
రువడి నడఁగుదురు వారు భ్రాంతులు నగుచున్.

టీకా:

నరపతుల = ఆ రాజుల; మహిమన్ = గొప్పతనాన్ని; అంతయున్ = సమగ్రముగ; ఉరగాధిపుడు = వెయ్యితలల ఆదిశేషుడు {ఉరగాదిఫుడు - ఉరగముల (సర్పముల)కు అధిపతి, ఆదిశేషుడు}; ఐనన్ = అయినప్పటికిని; నొడువన్ = చెప్పుటకు; ఓపడు = సరిపడడు; ధాత్రిన్ = రాజ్యాన్ని; చిరకాలంబు = చాలాకాలము; ఏలి = పాలించి; ఇందే = ఇక్కడనే; పరు = అతి; వడిన్ = శీఘ్రముగా; అడగుదురు = నశించెదరు; వారు = వాళ్ళు; భ్రాంతులు = భ్రాంతిమగ్నులు; అగుచున్ = ఔతూ.

భావము:

ఆ రాజుల గొప్పతనాన్ని ఆ వెయ్యితలల ఆదిశేషుడైనా సమగ్రంగా చెప్పలేడు. వారు చాలాకాలం భూమిని ఏలుతారు. అయినా భ్రాంతి మగ్నులై ఇక్కడే అణగిపోతారు.