పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : ద్వాదశాదిత్య ప్రకారంబు

  •  
  •  
  •  

12-46-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుష్కరం బందు, ద్వారకాపురము నందు,
థుర యందును, రవిదిన మందు నెవఁడు
ఠన సేయును రమణతో భాగవతము
వాఁడు తరియించు సంసారవార్ధి నపుడ.

టీకా:

పుష్కరంబు = పుష్కరతీర్థం; అందున్ = లో; ద్వారకాపురము = ద్వారకాపట్టణము; అందున్ = లో; మథుర = మథురానగరం; అందును = లోను; రవిదినము = ఆదివారము; అందున్ = లోను; ఎవడు = ఎవరైతే; పఠన = చదువుట; చేయున్ = చేస్తాడో; రమణ = ఆసక్తిపూర్వకంగా; భగవతమున్ = భాగవతమును; వాడు = అట్టివాడు; తరియించున్ = దాటును; సంసార = సంసారమనెడు; వార్ధిన్ = సముద్రమును; అపుడ = ఆ సమయమునందే.

భావము:

పుష్కరతీర్థంలో కానీ, ద్వారకాపట్టణంలో కానీ, మధురానగరంలోకానీ ఆదివారంనాడు ఆసక్తి పూర్వకంగా భాగవతాన్ని చదివిన భక్తుడు వెంటనే సంసార సాగరాన్ని తరిస్తాడు.