పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : యదు వృష్ణి భో జాంధక వంశంబు

  •  
  •  
  •  

10.2-1334-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మోత్సాహముతోడ మాధవుఁడు శుంల్లీలఁ బూరించు న
మ్ముళీగానము వీనులం జిలికినన్ మోదించి గోపాల సుం
రు లేతెంతు రరణ్యభూములకుఁ; దద్దాస్యంబు గామించి య
క్కరుణావార్థి భజింప కుందురె బుధుల్‌ కౌరవ్యవంశాగ్రణీ!

టీకా:

పరమ = మిక్కిలి; ఉత్సాహము = ఉత్సాహము; తోడన్ = తోటి; మాధవుడు = కృష్ణుడు; శుంభత్ = మిక్కిలి విలాసవంతమైన; లీలన్ = విధముగా; పూరించు = ఊదెడి; ఆ = ఆ; మురళీ = పిల్లనగ్రోవి; గానము = పాట; వీనులన్ = చెవుల యందు; చిలికినన్ = సోకినంతనే; మోదించి = సంతోషముపొంది; గోపాల = గోపికా; సుందరులు = స్త్రీలు; ఏతెంతురు = వచ్చెదరు; అరణ్య = అటవీ; భూముల్ = ప్రాంతముల; కున్ = కు; తత్ = అతనిని; దాస్యంబున్ = సేవించుటలను; కామించి = కోరి; ఆ = ఆ; కరుణా = దయా; వార్థిన్ = సముద్రుని; భజింపక = సేవింపకుండా; ఉందురె = ఉంటారా; బుధుల్ = మంచిబుద్ధి కలవారు; కౌరవ్యవంశాగ్రణీ = పరీక్షిన్మహారాజా {కౌరవ్యవంశాగ్రణి – కురువంశము నందు అగ్రణీ (ముఖ్యమైన వాడు), పరీక్షిత్తు}.

భావము:

“ఓ కురుకులోత్తమరాజ! మహోత్సాహంతో శ్రీకృష్ణుడు మురళిని మ్రోగిస్తే ఆ గానం చెవులలో సోకగానే కృష్ణుడిని సేవించాలనే కాంక్షతో సుందర గోపికలు పరమానందంతో బృందావన ప్రాంతా అడవులకు పరుగెత్తుకుని వస్తారు. ప్రాజ్ఞులైనవారు ఆ కరుణామూర్తిని ఆయన సేవను కోరి పూజించకుండా ఎవరు ఉండలేరు కదా.