పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట

  •  
  •  
  •  

10.2-76-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱిగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె; నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు, బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిఁ జని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; తన = తన యొక్క; పరాక్రమంబునన్ = పరాక్రమముతో; జాంబవతీదేవిన్ = జాంబవతీదేవిని; పరిగ్రహించి = చేపట్టి; రాజు = రాజు (ఉగ్రసేనుని); సభ = కొలువున; కున్ = కు; సత్రాజిత్తున్ = సత్రాజిత్తుని; పిలిపించి = రప్పించి; తత్ = ఆ యొక్క; వృత్తాంతంబు = జరిగిన కథను; అంతయున్ = సమస్తమును; ఎఱిగించి = తెలిపి; సత్రాజిత్తున్ = సత్రాజిత్తుని; కున్ = కి; మణిన్ = రత్నమును; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; అతండును = అతను కూడ; సిగ్గుపడి = సిగ్గుపడి; మణిన్ = రత్నమును; పుచ్చుకొని = తీసుకొని; పశ్చాత్తాపంబున్ = జరిగిదానికి బాధ; ఒందుచున్ = పొందుతు; బలవత్ = బలవంతునితో; విరోధంబున్ = శత్రుత్వమున; కున్ = కు; వెఱచుచు = బెదురుతు; ఇల్లు = నివాసమున; కిన్ = కి; చని = వెళ్ళి;

భావము:

ఈలాగున శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీదేవిని చేపట్టి, రాజసభకు సత్రాజిత్తును రప్పించి, జరిగిన విషయమంతా చెప్పి, మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపం చెందాడు. బలవంతుడితో విరోధం వచ్చిందే అని భయపడుతూ ఇంటికి చేరాడు.