పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కృష్ణుని భార్యా సహస్ర విహారంబు

  •  
  •  
  •  

10.2-1331-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నవర! దేవాసుర సం
మును మును నిహతులైన క్రవ్యాద సము
త్కము నరేశ్వరులై ద్వా
మున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్.

టీకా:

నరవర = రాజా; దేవ = దేవతల; అసుర = రాక్షసుల; సంగరమున = యుద్ధము నందు; మును = పూర్వము; నిహతులు = చంపబడినవారు; ఐన = అయినట్టి; క్రవ్యాద = రాక్షసుల; సముత్కరము = సమూహములు; నరేశ్వరులు = రాజులు; ఐ = అయ్యి; ద్వాపరమునన్ = ద్వాపరయుగమున; జనియించి = పుట్టి; ప్రజలన్ = లోకులను; బాధలపఱుపన్ = బాధపెట్టగా.

భావము:

“ఓ నరేంద్రా! పూర్వం దేవదానవ సంగ్రామంలో మరణించిన రాక్షసులు అందరు ద్వాపరయుగంలో రాజులుగా పుట్టి ప్రజలను బాధించసాగారు.