పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కృష్ణుని భార్యా సహస్ర విహారంబు

  •  
  •  
  •  

10.2-1329.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందనులలోన ధరణి నెన్నంగ బాహు
ల పరాక్రమ విజయ సంద్విశేష
మాని తాత్ములు పదునెనమండ్రు; వారి
నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర! "

టీకా:

హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; గృహమేధి = గృహస్థుడు {గృహమేధి - గృహస్థాశ్రమ ధర్మమున కట్టుబడినవాడు, గృహస్థుడు}; అగుచున్ = వలెనుంటు; శతోత్తరషోడశసాహస్ర = పదహారువేలవందమంది (16,100); సుందరులను = అందగత్తెలను; మును = ఇంతకుముందు; నీ = నీ; కున్ = కు; ఎఱుగ = తెలియ; చెప్పిన = చెప్పనట్టి; రీతిన్ = విధముగ; అందఱన్ = అందరికి; అన్ని = అన్ని; రూపములున్ = ఆకృతులను; తానన్ = తనే; అర్థిన్ = కోరి; తాల్చి = ధరించి; కైకొని = చేపట్టి; ఒక్కొక్క = ప్రతి యొక్క; కామినీ = స్త్రీ; మణి = రత్నము; అందున్ = తోను; రమణనన్ = చక్కగా; అమోఘ = వ్యర్థముగాని; వీర్యమునన్ = వీర్యము; చేసి = వలన; పదురేసి = పదిమంది (10) చొప్పున; కొడుకులన్ = పుత్రులను; పడసెన్ = పొందెను; రుక్మిణి = రుక్మిణీదేవి; ఆది = మొదలగు; పట్టమహిషుల్ = పట్టముగట్టిన భార్యల; కున్ = కు; ఉద్భవులున్ = కలిగినవారు; ఐన = అయినట్టి.
నందనుల = కొడుకుల; లోన = అందు; ధరణిన్ = భూమ్మీద; ఎన్నంగన్ = ఎంచిచూడగా; బాహుబల = భుజబలము; పరాక్రమ = విక్రమము; విజయ = జయశీలము; సంపత్ = కలిమి యొక్క; విశేష = అధిక్యముచేత; మానిత = గౌరవింపదగిన; ఆత్ములు = స్వభావములు కలవారు; పదునెనమండ్రు = పద్దెనిమిది (18)మంది; వారిన్ = వారిని; ఎఱుగన్ = తెలియునట్లు; వినిపింతున్ = చెప్పెదను; వినుము = వినుము; రాజేంద్రచంద్ర = మహారాజా {రాజేంద్రచంద్రుడు - రాజులలో ఇంద్రుని వంటి చంద్రుని వంటి వాడు, మహారాజు}.

భావము:

పరీక్షిత్తు మహారాజా! ఈ విధంగా పదహారువేల సుందరీమణులకు అందరకూ అన్నిరూపాలు ధరించి గృహస్థుడై శ్రీకృష్ణుడు ఏలుకున్నాడు. అమోఘ వీర్యుడైన ఆ మహానుభావుడికి, వారిలో ఒక్కొక్కరి యందు పదిమంది చొప్పున పుత్రులు పుట్టారు. రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన పుత్రులలో పదునెనిమిదిమంది భుజబల, పరాక్రమ, వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. వారి పేర్లను చెప్తాను. శ్రద్ధగా విను.”