పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కృష్ణుని భార్యా సహస్ర విహారంబు

  •  
  •  
  •  

10.2-1326-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్
వితిం బొందఁగఁజాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచుం
రిరంభించుచు, నంటుచున్నగుచుసంభాషించుచున్నుండు సుం
రు లానంద నిమగ్ను లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా! "

టీకా:

హరి = కృష్ణుని; నామ = పేరులకు; అంకితము = గురుతుగా కలవి; ఐన = అయిన; గీతమున్ = పాటను; ఒక = ఒక; మాటు = మాటు; ఆలించి = విని; మూఢాత్ములున్ = తెలివిమాలినవారు; విరతిన్ = వైరాగ్యమును; పొందగన్ = పొందను; చాలి = సమర్థులై; ఉందురు = ఉంటారు; అట = అట; ఆ = ఆ; విశ్వాత్మున్ = కృష్ణుని; ఈక్షించుచున్ = చూస్తు; పరిరంభించుచన్ = ఆలింగనములు చేయుచు; అంటుచున్ = తాకుతు; నగుచున్ = పరిహాసములు చేయుచు; సంభాషించుచున్ = మాట్లాడుతు; ఉండు = ఉండెడి; సుందరులు = అందగత్తెలు; ఆనంద = ఆనందము నందు; మగ్నులు = మునిగిన వారు; ఔట = అగుట; కున్ = కి; ఇలన్ = ఈ లోకములో; చోద్యంబు = విచిత్రము; ఏమి = ఏమున్నది; భూవల్లభా = రాజా.

భావము:

మహారాజ! ఎంతటి మూఢాత్ములైనా హరినామ సంకీర్తనం ఒక్కసారి వింటేనే ముక్తిని పొందుతారుట. అలాంటిది ఆ మహానీయుడినే చూస్తూ; అతడిని కౌగలిస్తూ, తాకుతూ; అతనితో నవ్వుతూ, సంభాషిస్తూ; ఆ అంగనలు ఆనందపారవశ్యులు కావడంలో ఆశ్చర్యం ఏముంది?”