పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1322-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుతముగాఁ బెక్కు స
ములు దనుఁ దాన కూర్చి వైదిక యుక్తిం
బొరించుచు ననురాగము
మునఁ దళుకొత్త దైత్యర్దనుఁ డెలమిన్.

టీకా:

జన = ప్రజలచేత; వినుతముగాన్ = కొనియాడబడునట్లుగా; పెక్కు = అనేకమైన; సవనములున్ = యాగములను; తనున్ = తనను, పరబ్రహ్మను; తాన = తనే; కూర్చి = ఉద్ధేశించి; వైదిక = వేదము లందు చెప్పబడిన; యుక్తిన్ = క్రమముగా; ఒనరించుచన్ = చేయుచు; అనురాగము = అనురక్తి; మనమునన్ = మనసున; తళుకొత్త = కలుగగా; దైత్యమర్దనుడు = కృష్ణుడు; ఎలమిన్ = సంతోషముతో (ఉండెను).

భావము:

సంతోషచిత్తుడై ప్రజలు మెచ్చేలాగ అనేక యజ్ఞ యాగాలను శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా తనను ఉద్దేశించి తనే పరమోత్సాహంతో జరిపించాడు,