పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1321-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి, సర్వేశుఁ, డనంతుఁ, డాద్యుఁ, డభవుం, డామ్నాయసంవేది, భూ
సు ముఖ్యప్రజలన్ సమస్త ధనవస్తుశ్రేణి నొప్పారఁగాఁ
రిరక్షించుచు ధర్మమున్ నిలుపుచుం బాపాత్ములం ద్రుంచుచుం
మోత్సాహ మెలర్ప భూరిశుభ విభ్రాజిష్ణుఁడై ద్వారకన్.

టీకా:

హరి = కృష్ణుడు; సర్వేశుడు = ఎల్లర నియమించువాడు; అనంతుడు = తుది లేనివాడు; ఆద్యుడు = జగత్తుకు మూలకారణుడు; అభవుడు = పుట్టుక లేనివాడు; ఆమ్నాయసంవేది = వేదముల నెరిగినవాడు; భూసుర = విప్రులు; ముఖ్య = మొదలగు; ప్రజలన్ = జనుల నందరను; సమస్త = అన్ని రకాల; ధన = సంపదల; వస్తు = వస్తువుల; శ్రేణి = సమూహముచేత; ఒప్పారగా = ఒప్పునట్లు; పరిరక్షించుచు = కాపాడుతు; ధర్మమున్ = ధర్మమును; నిలుపుచున్ = స్థాపించుచు; పాపాత్ములన్ = పాపులను; త్రుంచుచున్ = చంపుతు; పరమ = మిక్కిలి; ఉత్సాహము = ఉత్సాహము; ఎలర్పన్ = అతిశయించగా; భూరి = అతిమిక్కిలి; శుభ = శుభములచేత; విభ్రాజిష్ణుడు = వెలుగువాడు; ఐ = అయ్యి; ద్వారకన్ = ద్వారకాపట్టణము నందు.

భావము:

అనంతుడు, వేదవేద్యుడు, సర్వేశ్వరుడు, ఆద్యుడు, అభవుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసాడు. వారిని సంరక్షిస్తూ ధర్మాన్ని సంస్థాపిస్తు పాపాత్ములను సంహరిస్తు, ద్వారకలో గొప్ప శుభసంతోషాలతో ప్రకాశించాడు.