పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1319-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ
గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము
వినుతి సేయుచుఁ దత్పాదజములకు
వందనము లాచరించి యానంద మొందె.

టీకా:

వారిజాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; భక్తమందారున్ = భక్తుల ఎడలి కల్పవృక్షమును; అనఘున్ = పుణ్యుని; కృష్ణున్ = కృష్ణుని; అఖిలేశున్ = సర్వనియామకుని; కేశవున్ = కేశి అను అసురుడిని చంపినవాని; జిష్ణున్ = జయశీలుని; పరమున్ = పరబ్రహ్మమును; వినుతి = స్తుతించుట; చేయుచున్ = చేస్తూ; తత్ = అతని; పాద = పాదములు అను; వనజములు = పద్మముల; కున్ = కు; వందనములున్ = నమస్కారములు; ఆచరించి = చేసి; ఆనందమున్ = సంతోషమును; ఒందెన్ = పొందెను.

భావము:

పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు.