పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1316-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని "యా డింభకులను దో
కొని పొం" డని యిచ్చి వీడుకొలిపిన వారల్‌
వితు లయి పెక్కు విధముల
వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్.

టీకా:

అని = అని చెప్పి; ఆ = ఆ యొక్క; డింభకులన్ = పిల్లలను; తోకొని = వెంటబెట్టుకొని; పొండి = పొండి; అని = అని చెప్పి; ఇచ్చి = ఇచ్చి; వీడుకొలిపినన్ = శలవు ఇవ్వగా; వారల్ = వారు; వినతులు = స్తుతించినవారు; అయి = ఐ; పెక్కు = అనెకమైన; విధములన్ = విధములుగా; వినుతించుచున్ = స్తోత్రములు చేయుచు; అచటున్ = ఆ చోటును; వాసి = వదలిపెట్టి; విప్రుని = బ్రాహ్మణుని; సుతులన్ = పుత్రులను.

భావము:

అని పిమ్మట “ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి” అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు.