పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1305-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పుర గోష్ఠ దుర్గ వన జానపదాచల పక్కణప్రభూ
ద నదీ సరోవర యుక్షితి నంతయు దాఁటి సప్త వా
రినిధుల దీవులం గులగిరిప్రకరంబుల నుత్తరించి మే
రుగము నాక్రమించుచు మరుద్గతితో రథ మేగ నత్తఱిన్.

టీకా:

చని = వెళ్ళి; పుర = పట్టణములు; గోష్ఠ = ఆవులమందలు; దుర్గ = కోటలు; వన = అడవులు; జానపద = పల్లెలు; అచల = కొండలు; పక్కణ = బోయగూడెములు; ప్రభూత = చాలాగొప్పవైన; నదములు = పడమరకు పారు ఏరులు; నదీ = తూరుపుకు పారు ఏరులు; సరోవర = చెరువులు; యుత = తో కూడియున్న; క్షితి = భూమిని; అంతయున్ = అంతటిని; దాటి = దాటి; సప్త = సప్త; వారినిధుల = సముద్రముల; దీవులనున్ = ద్వాపములను; కులగిరి = కులపర్వతముల; ప్రకరంబులన్ = సమూహములను; ఉత్తరించి = దాటి; మేరునగమున్ = మేరుపర్వతమును; ఆక్రమించుచున్ = అతిక్రమించుచు; మరుత్ = వాయు; గతి = వేగము; తోన్ = తోటి; రథము = రథము; ఏగన్ = వెళ్ళుచుండగా; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు.

భావము:

పట్టణాలతో పల్లెలతో దుర్గాలతో అరణ్యాలతో పర్వతాలతో నదీనదాలతో సరోవరాలతో నిండిన భూమండలం, సప్తసముద్రాలు, మహాదీవులు, కులపర్వతాలు, మేరుపర్వతం దాటి శ్రీకృష్ణుడి రథం మహావేగంతో ముందుకు సాగిపోయింది.