పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1304-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుంరదివ్యరత్నరుచి శోభితమై తనరారు కాంచన
స్యంన మంబుజాప్తుఁ డుదయాచల మెక్కు విధంబు దోఁపఁ బౌ
రంరి దాను నెక్కి తను శ్ములు దిగ్వితతిన్ వెలుంగ గో
విందుఁ డుదారలీలఁ జనె విప్రతనూజ గవేషణార్థియై.

టీకా:

సుందర = అందమైన; దివ్య = శ్రేష్ఠమైన; రత్న = మణుల; రుచి = కాంతులతో; శోభితము = ప్రకాశించుచున్నది; ఐ = అయ్యి; తనరారు = ఉన్నట్టి; కాంచన = బంగారు; స్యందనమున్ = రథమును; అంబుజాప్తుడు = సూర్యుడు {అంబుజాప్తుడు - పద్మబాంధవుడు, సూర్యుడు}; ఉదయాచలము = తూర్పుకొండను; ఎక్కు = ఎక్కెడి; విధంబున్ = విధము; తోపన్ = కనబడునట్లుగా; పౌరందరిన్ = అర్జునుడు {పౌరంద్రి - పురందరుని (ఇంద్రుని) కొడుకు, అర్జునుడు}; తానున్ = అతను; ఎక్కి = ఎక్కి; తను = దేహ; రశ్ములు = కాంతులు; దిక్ = దిక్కులు; వితతిన్ = అన్నిటను; వెలుంగన్ = ప్రకాశించగా; గోవిందుడు = కృష్ణుడు; ఉదారలీలన్ = గొప్పగా; చనెన్ = బయలుదేరెను; విప్ర = బ్రాహ్మణుని; తనూజ = కొడుకులను; గవేషణ = వెతుకుట; అర్థి = కోసము; ఐ = అయ్యి.

భావము:

సూర్యుడు ఉదయపర్వతాన్నిఎక్కినట్లు, అందమైన దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అధిరోహించాడు. తన దేహకాంతులు దిక్కుల ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు విప్రబాలురను వెదకటానికి బయలుదేరాడు.