పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : విప్రుని ఘనశోకంబు

  •  
  •  
  •  

10.2-1296-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముంట నిల్చి "ముకుంద! స
నంనమునివినుత! నందనందన! పరమా
నం! శరదిందు చందన
కుం యశస్సాంద్ర! కృష్ణ! గోవింద! హరీ!

టీకా:

ముందట = ఎదురుగా; నిల్చి = నిలబడి; ముకుంద = కృష్ణా; సనందన = సనందనుడు అను; ముని = దేవర్షిచేత; వినుత = స్తుతింపబడువాడ; నందనందన = నందుని కొడుక; పరమానంద = పరమానంద స్వరూప; శరత్ = శరదృతువు నందలి; ఇందు = చంద్రుని వంటి తెల్లని; చందన = మంచిగంధమువంటి సువాసనల; కుంద = మొల్లపూల వంటి చక్కటి; యశస్సు = కీర్తి; సాంద్రా = దట్టముగా కలవాడా; కృష్ణ = కృష్ణ; గోవింద = గోవులకు ఒడయుడ; హరీ = భక్తుల ఆర్తి హరించివాడ.

భావము:

శ్రీకృష్ణుడి సమక్షంలో నిలబడి. “ముకుందా! నందనందనా! సనందాది ముని వందితా! పరమానంద! శ్రీకృష్ణా! గోవిందా! హరీ! శరశ్చంద్రుని వెన్నెల వంటి గొప్ప సత్కీర్తి కలవాడా!
ఒకటి, అంతకన్నా ఎక్కువ హల్లులు పెక్కుమార్లు ఆవృత్తి చేయుట వృత్యనుప్రాస. అనగా ఒకే హల్లు అనేకసార్లు తిరిగితిరిగి వస్తే అది వృత్యనుప్రాస. ఇక్కడ విప్రుడు శ్రీకృష్ణుని స్తుతించు సందర్భంలో కంద పద్యంలో "పూర్ణానుస్వార పూర్వక ద" పది పర్యాయాలు వాడుతూ నింద చేయబోతున్నాడు అని సూచిస్తున్నాడా అన్నట్లు వృత్యనుప్రాస మన పోతన అలంకరించాడు.