పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భృగుమహర్షి శోధనంబు

  •  
  •  
  •  

10.2-1275-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విభుపాదములకు వం
ముం గావించి సముచిప్రియముల న
య్యలాక్షుని కోపము మా
న్చి నమ్మునినాథుఁ డచట నిలువక చనియెన్.

టీకా:

తన = తన యొక్క; విభు = భర్త; పాదములు = కాళ్ళ; కున్ = కు; వందనమున్ = నమస్కారములు; కావించి = చేసి; సముచిత = తగిన; ప్రియములన్ = మంచిమాటలచేత; ఆ = ఆ; అనలాక్షుని = శివుని {అనలాక్షుడు - అగ్నికల కన్నులు కలవాడు, శివుడు}; కోపము = కోపమును; మాన్చినన్ = పోగొట్టగా; ఆ = ఆ; ముని = ముని; నాథుడు = నాయకుడు; అచటన్ = అక్కడ; నిలువక = నిలబడకుండా; చనియెన్ = వెళ్ళిపోయెను.

భావము:

పార్వతీదేవి పతి పాదాలమీదపడి సముచిత మధుర వచనాలతో అతని కోపం పోగొట్టింది. భృగువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.