పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భృగుమహర్షి శోధనంబు

  •  
  •  
  •  

10.2-1274-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిటలాంబకుండు గమలాసన నందనుఁ జూచి భూరి కా
లాల రోషవేగ భయదాకృతిఁ దాల్చి పటుస్ఫులింగ సం
తాము లొల్క శూలమునఁ దాపసముఖ్యు నురంబు వ్రేయఁగాఁ
బూనినఁ బార్వతీరమణి బోరన నడ్డము వచ్చి చెచ్చెరన్;

టీకా:

ఆ = ఆ యొక్క; నిటలాంబకుండు = శివుడు {నిటలాంబకుడు - నుదుట కన్ను కలవాడు, శివుడు}; కమలాసననందనున్ = భృగువును {కమలాసన నందనుడు - బ్రహ్మదేవుని కొడుకు, భృగువు}; చూచి = చూసి; భూరి = మిక్కుటమైన; కాలా = ప్రళయకాలపు; అనల = అగ్ని వంటి; రోష = కోపము యొక్క; వేగ = వడిచేత; భయద = భీకరమైన; ఆకృతిన్ = ఆకారమును; తాల్చి = ధరించి; పటు = అధికమైన; స్ఫులింగ = అగ్నికణముల; సంతానములు = సమూహములు; ఒల్కన్ = రాలగా; శూలమునన్ = త్రిశూలముతో; తాపస = ఋషి; ముఖ్యున్ = ఉత్తముని; ఉరంబున్ = వక్షస్థలమును; వ్రేయగా = కొట్టుటకు; పూనినన్ = సిద్ధపడగా; పార్వతీరమణి = పార్వతీదేవి; బోరనన్ = అతి శీఘ్రముగా; అడ్డమున్ = అడ్డముగా; వచ్చి = వచ్చి; చెచ్ఛెరన్ = తటాలున.

భావము:

ముక్కంటి పరమశివుడు, బ్రహ్మపుత్రుడైన భృగువు ఎడల ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన విస్ఫులింగాలు వెదజల్లే త్రిశూలంతో ఆ మహర్షిని వక్షంపై పొడవడానికి ప్రయత్నించాడు. కాని, పార్వతీదేవి చటుక్కున అడ్డువచ్చి....