పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వృకాసురుండు మడియుట

  •  
  •  
  •  

10.2-1260-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సు లసురాంతకు మీఁదన్
మందారప్రసూన ర్షము లోలిం
గురిసిరి తుములంబై దివి
మొసెన్ సురదుందుభిప్రముఖతూర్యంబుల్‌.

టీకా:

సురలు = దేవతలు; అసురాంతకు = విష్ణుమూర్తి; మీదన్ = మీద; వర = శ్రేష్ఠములైన; మందార = మందార; ప్రసూన = పూల; వర్షములు = వానలు; ఓలిన్ = యోగ్యముగా; కురిసిరి = కురిపించిరి; తుములంబు = సందడిచేయునవి; ఐ = అయ్యి; దివిన్ = ఆకాశము నందు; మొరసెన్ = మోగినవి; సుర = దేవతా; దుందుభి = భేరీలు; ప్రముఖ = మున్నగు; తూర్యంబుల్ = వాయిద్యములు.

భావము:

దానవవైరి హరి మీద దేవతలు మందార పూల వాన కురిపించారు. ఆకాశంలో దేవ దుందుభులు మున్నగు దివ్య వాయిద్యాలు మ్రోగాయి.