పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వృకాసురుండు మడియుట

  •  
  •  
  •  

10.2-1258-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి దుశ్శంకలు మాని పొ"మ్మనిన దైత్యారాతి మాయా విమో
హితుఁడై విస్మృతి నొంది తామసముచే నేపారి వాఁ డాత్మ పా
ణిలంబుం దన నెత్తి మోపికొని తా నేలన్ వెసం గూలె వి
శ్రుదంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబో యనన్.

టీకా:

అతి = మితిమీరిన; దుశ్శంకలు = అనవసర సందేహములు; మాని = వదలిపెట్టి; పొమ్ము = పొమ్ము; అనినన్ = అని చెప్పగా; దైత్యారాతి = విష్ణు; మాయా = మాయ చేత; విమోహితుడు = మోహమున పడినవాడు; ఐ = అయ్యి; విస్మృతిన్ = మరపులో; ఒంది = పడిపోయి; తామసము = తెలివితక్కువ; చేన్ = వలన; ఏపారి = అతిశయించి; వాడు = అతడు; ఆత్మ = తన; పాణితలంబున్ = అరచేతిని; తన = తన యొక్క; నెత్తిన్ = తలమీద; మోపికొని = పెట్టుకొని; తాన్ = తనే; నేలన్ = నేలమీద; వెసన్ = వడిగా; కూలెన్ = పడిపోయెను; విశ్రుత = ప్రసిద్ధమైన; దంభోళి = వజ్రాయుధము యొక్క; హతిన్ = దెబ్బతోటి; వడిన్ = శీఘ్రమే; పడు = పడిపోయెడి; మహా = పెద్ద; క్షోణీధరంబో = కొండేమో; అనన్ = అనునట్లుగా.

భావము:

అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు. వెంటనే బయలుదేరు.” అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమాయవలన తనను తాను మరచి, తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహా పర్వతంలా నేలకూలాడు.