పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వృకాసురుండు మడియుట

  •  
  •  
  •  

10.2-1240-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి కొలువ శీఘ్రకాలంబులోనన
యిష్టమైన వరము లిచ్చునట్టి
దైవ మెవ్వఁ డనిన దానవుఁ గనుఁగొని
మునివరుండు పలికె ముదముతోడ.

టీకా:

కడగి = పూని; కొలువన్ = సేవించినచో; శీఘ్రకాలంబునన్ = తక్కువకాలము; లోనన = లోనే; ఇష్టమైన = కోరిన; వరముల్ = వరములను; ఇచ్చునట్టి = ఇచ్చెడి; దైవము = దేవుడు; ఎవ్వడు = ఎవరు; అనినన్ = అనగా; దానవున్ = రాక్షసుని; కనుగొని = చూసి; ముని = ముని; వరుండు = ఉత్తముడు; పలికెన్ = చెప్పెను; ముదము = సంతోషము; తోడన్ = తోటి.

భావము:

తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు.” అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు.