పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : విష్ణు సేవా ప్రాశస్త్యంబు

  •  
  •  
  •  

10.2-1233-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాదసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం
కేరుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం
డారిన భక్తిమై నడిగి ట్ల యతండును మందహాస వి
స్ఫా కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్.

టీకా:

నారద = నారదుడు అను; సంయమి = ఋషి; ఇంద్రు = ఉత్తముని; వలనన్ = వలన; వినుచుండి = వింటూ; అనంతరంబ = పిమ్మట; పంకేరుహనాభున్ = కృష్ణుని; చూచి = చూసి; అడిగెన్ = ప్రశ్నించెను; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; నిండారిన = సంపూర్ణమైన; భక్తిమై = భక్తితో; అడిగిన = అడిగిన; అట్లన్ = ఆ విధముగనే; అతండును = అతను కూడ; మందహాస = చిరునవ్వుతో; విస్ఫారిన్ = బాగా మెరుస్తున్న; కపోలుడు = చెక్కిళ్ళు కలవాడు; ఐ = అయ్యి; పలికెన్ = చెప్పెను; పాండుతనూభవు = ధర్మరాజు; తోడన్ = తోటి; చెచ్ఛెరన్ = శీఘ్రమే.

భావము:

అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం, నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను, పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు.