పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు

  •  
  •  
  •  

10.2-1201-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని సర్వలోక విభుఁ డగు
జోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా
భూమీసురుఁ డమ్ముని
నులకు సద్భక్తిఁ బూజ లిపెన్ వరుసన్.

టీకా:

అని = అని చెప్పి; సర్వ = సమస్తమైన; లోక = లోకములకు; విభుడు = ప్రభువు; అగు = ఐన; వనజోదరుడు = కృష్ణుడు; ఆనతిచ్చు = చెప్పెడి; వాక్యంబులన్ = మాటల; జాడన = విధముగనే; భూమీసురుండు = బ్రాహ్మణుడు; ఆ = ఆ; ముని = ఋషుల; జనుల్ = సమూహముల; కున్ = కు; సద్భక్తిన్ = మంచిభక్తితో; పూజన్ = అర్చించుట; సలిపెన్ = చేసెను; వరుసన్ = వరుసగా.

భావము:

లోకాలు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శ్రుతదేవుడు అత్యంతభక్తితో ఆ మునిపుంగవులను పూజించాడు.