పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు

  •  
  •  
  •  

10.2-1194-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ, త
చ్చణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా
రుఁ గని వల్కె "భక్తజనత్సల! మామకభాగ్య మెట్టిదో
చతురాస్యులున్నెఱుఁగ ట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్.

టీకా:

తరుణియున్ = భార్య; తానున్ = అతను; పుత్రులున్ = కొడుకులు; పదంపడి = ఒకరి వెను నొకరు; కృష్ణున్ = కృష్ణుని; భజించుచుండన్ = సేవించుచుండగా; తత్ = అతని; చరణములన్ = పాదములను; అంకపీఠమునన్ = ఒడిలోకి; చాచినన్ = చాపగా; మెల్లనన్ = మెల్లిగా; ఒత్తుచున్ = పిసుకుచు; రమావరునిన్ = కృష్ణుని; కని = చూసి; పల్కెన్ = ఇట్లనెను; భక్త = భక్తులైన; జన = వారల ఎడ; వత్సల = వాత్సల్యము కలవాడా; మామక = మా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్టిదో = ఎంతగొప్పదో; హర = శివుడు; చతురాస్యులు = చతుర్ముఖబ్రహ్మ; ఎఱుగనట్టి = తెలిసికోలేని; నినున్ = నిన్ను; కనుగొంటిన్ = దర్శించగలిగితిని; నెమ్మిన్ = ప్రీతి; తోన్ = తోటి.

భావము:

తను తన భార్యాపుత్రులూ కృష్ణుడిని స్తుతిస్తూ ఉండగా, ఆయన పాదాలను ఒడిలో చేర్చుకుని మెత్తగా ఒత్తుతూ శ్రుతదేవుడు ఆ శ్రీపతితో ఇలా అన్నాడు. “భక్తవత్సలా! నా భాగ్యం ఎంత గొప్పదో కదా. పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కనలేని నిను దర్శించగలిగాను.