పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు

  •  
  •  
  •  

10.2-1191-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిములఁ దాల్చి, నవ్యతులసీదళదామ కుశప్రసూన వి
స్ఫు దరవింద మాలికలఁ బూజ లొనర్చి, "గృహాంధకూప సం
ణుఁడ నైన నాకడకుఁ క్రి దనంతనె వచ్చునట్టి సు
స్థిమతి నే తపంబు మును సేసితినో?" యని సంతసించుచున్.

టీకా:

శిరములన్ = తలలపై; తాల్చి = ధరించి; నవ్య = తాజా; తులసీదళ = తులసీ దళముల; దామ = దండ; కుశ = దర్భలు; ప్రసూన = పూలు; విస్ఫురత్ = వికసించిన; అరవింద = పద్మముల; మాలికలన్ = దండలతో; పూజలున్ = అర్చనలు; ఒనర్చి = చేసి; గృహ = ఇల్లు అను; అంధ = చీకటి; కూప = నూతిలో; సంచరణుడను = మెలగువాడను; ఐన = అయిన; నా = నా; కడ = వద్ద; కున్ = కు; చక్రిన్ = కృష్ణుడు; తనంతనె = స్వయంగా; వచ్చునట్టి = వచ్చుటకు తగినట్లు; సుస్థిర = మిక్కిలి నిలుకడైన; మతిన్ = బుద్ధితో; ఏ = ఎలాంటి; తపంబున్ = తపస్సును; మును = మునుపు; చేసితినో = చేసానో; అని = అని; సంతసించుచున్ = సంతోషించుచు.

భావము:

కృష్ణుని పాదజలాన్ని వారు తమ తలల మీద జల్లుకున్నారు. తులసిమాలలనూ, తామరపూల హారాలనూ వారికి సమర్పించి పూజించాడు. “ఈ ఇల్లనే చీకటినూతిలో పడికొట్టుకుంటున్న నా దగ్గరకు చక్రి శ్రీకృష్ణుడు తనంత తానుగా రావటానికి నేను ఎంతటి తపస్సు చేసానో కదా.” అని ఎంతో సంతోషించాడు.