పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు

  •  
  •  
  •  

10.2-1190-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా
తిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి, యచ్చోట స
మ్మతి దర్భాస్తరణంబులన్నునిచి, సమ్యగ్జ్ఞానపారీణుఁడై
తియుం దానుఁ బదాబ్జముల్‌ గడిగి చంద్భక్తిఁ దత్తోయముల్‌.

టీకా:

శ్రుతదేవుండును = శ్రుతదేవుడు; మోది = సంతోషించినవాడు; ఐ = అయ్యి; ముని = మునులైన; జన = వారి; స్తోమంబున్ = సమూహము; తోన్ = తోటి; ఇందిరాపతిన్ = కృష్ణుని, లక్ష్మీపతిని; తోకొంచున్ = కూడా తీసుకుని వెళ్తూ; నిజ = తన; ఆలయంబున్ = గృహమున; కున్ = కు; ఒప్పన్ = చక్కగా; ఏగి = వెళ్ళి; అచ్చోటన్ = అక్కడ; సమ్మతిన్ = ఇష్టముతో; దర్భ = దర్భల; ఆస్తరణంబులన్ = చాపలపై, ఆసనములపై {దర్భ + ఆస్తరణంబులన్ = దర్భాస్తరణంబులన్, సవర్ణదీర్ఘ సంధి}; ఉనిచి = కూర్చుండబెట్టి; సమ్యక్ = పరమాత్మకు చెందిన; ఙ్ఞాన = ఙ్ఞానమునందు; పారీణుడు = మిక్కిలి తెలిసినవాడు; ఐ = అయ్యి; సతియున్ = భార్య; తానున్ = తను; పద = పాదములు అను; అబ్జముల్ = పద్మములను; కడిగి = కడిగి; చంచత్ = మెరుస్తున్న; భక్తిన్ = భక్తితో; తత్ = ఆ యొక్క; తోయముల్ = నీటిని.

భావము:

శ్రుతదేవుడు కూడ పరమానందంతో శ్రీకృష్ణుడిని మునులనూ తన ఇంటిలోకి తీసుకు వెళ్ళాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి అతడు, అతని భార్యా వారి పాదపద్మాలను కడిగి, ఆ నీటిని...