పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు

  •  
  •  
  •  

10.2-1189-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యభ్యర్థించినం బ్రసన్నుండై యప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, యమ్మిథిలానగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె; నంత.

టీకా:

అని = అని; అభ్యర్థించినన్ = ప్రార్థించగా; ప్రసన్నుండు = అనుగ్రహించువాడు; ఐ = అయ్యి; ఆ = ఆ దివ్యమైన; పుండరీకాక్షుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; నిమి = నిమి; కుల = వంశమును; ప్రదీపకుండు = ప్రకాశింపజేయువాడు; ఐన = అయిన; జనకచక్రవర్తిన్ = బహుళాశ్వ మహారాజుని; కరుణించి = అనుగ్రహించి; ఆ = ఆ; మిథిలానగరంబునన్ = మిథిలానగరము నందు; పౌరజనంబుల్ = ప్రజల; కున్ = కు; ఉన్నత = ఉత్తమమైన; శోభనంబులున్ = సౌఖ్యములను; కావించుచున్ = కలిగించుచు; కొన్ని = కొద్ది; దినంబులున్ = రోజులు; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట.

భావము:

ఈ రీతిని నిమి వంశోద్ధారకుడు అయిన జనకుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలానగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ కొన్నాళ్ళ పాటు అక్కడే ఉన్నాడు. అంతట....