పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుభద్రా పరిణయంబు

  •  
  •  
  •  

10.2-1175-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రులం దేరుల నుత్తమ
రులన్ మణి హేమభూషణాంబరభృత్యో
త్క దాసికాజనంబుల
ణంబుగ నిచ్చి పంపె నుజకుఁ బ్రీతిన్.

టీకా:

కరులన్ = ఏనుగులను; తేరులన్ = రథములను; ఉత్తమ = శ్రేష్ఠములైన; హరులన్ = గుఱ్ఱములను; మణి = రత్నాల; హేమ = బంగారు; భూషణ = ఆలంకారములు; అంబర = వస్త్రములు; భృత్య = పరిచారుల; ఉత్కర = సమూహములు; దాసికా = పరిచారికా; జనంబులన్ = సమూహములను; అరణంబుగన్ = కట్నముగా; ఇచ్చి = ఇచ్చి; పంపెన్ = పంపించెను; అనుజ = తోబుట్టువు, చెల్లెలు; కున్ = కు; ప్రీతిన్ = ప్రీతితో.

భావము:

ప్రీతిగా బలరాముడు అరణంగా ఏనుగులు, రథాలు, మేలుజాతి అశ్వాలు, వస్త్రాలు, రత్నాభరణాలు, బంగారు భూషణాలు, దాసదాసీజనాలు సుభద్రకు పంపాడు