పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుభద్రా పరిణయంబు

  •  
  •  
  •  

10.2-1170-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుహపత్త్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స
ల్లలితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న
బ్బరిపునందనుండు గని భావజసాయకబాధ్యమాన వి
హ్వహృదయాబ్జుఁడై నిలిపె త్తరుణీమణియందుఁ జిత్తమున్.

టీకా:

జలరుహపత్రనేత్రు = కృష్ణుని; అనుసంభవ = తోబుట్టువు, చెల్లెలు; చారు = అందమైన; వధూ = పెళ్ళికాని అమ్మాయి, కన్య; లలామ = శ్రేష్ఠురాలు; సల్లలిత = మిక్కిలి మనోజ్ఞమైన; విహార = విహరించుటలు; విభ్రమ = వేగముగా తిరుగుటలు; విలాసములున్ = వయ్యారముల, అందముల; ఆత్మ = మనస్సున; కున్ = కు; విందుచేయన్ = సంతోషము కలిగించగా; ఆ = ఆ; బలరిపునందనుండు = అర్జునుడు; కని = చూసి; భావజ = మన్మథుని {భావజుడు – భావము నందు పుట్టువాడు, మన్మథుడు}; సాయక = బాణము; బాధ్యమాన = బాధింపబడుచుండుటచే; విహ్వల = కలతచెందిన; హృదయ = హృదయము అను; అబ్జుడు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; నిలిపెన్ = ఉంచెను, లగ్నముచేసెను; ఆ = ఆ యొక్క; తరుణీ = యౌవనవతి; మణి = ఉత్తమురాలి; అందున్ = ఎడల; చిత్తమున్ = మనస్సును.

భావము:

పద్మాక్షుడు శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్ర బహు అందమైనది. ఆమె సుందర సుకుమార వయో రూప విలాసాలు తన చిత్తానికి హత్తుకోగా, ఆ ఇంద్రతనయుడు అర్జునుడు మన్మథబాణాలకు గురై ఆమెపై మనసులో మిక్కిలి ఇష్టపడ్డాడు.