పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1161-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నులు దిగ్గనఁ జేపఁగఁ
న్నులనానందబాష్పణములుదొరఁగం
గ్రన్నన కౌఁగిట నిడి "ననుఁ
న్నన్నలు వచ్చి" రనుచుఁ గౌతుక మొప్పన్.

టీకా:

చన్నులున్ = స్తనములు; దిగ్గనన్ = చటుక్కున; చేపగన్ = పాలతో నిండిపోగా; కన్నులన్ = కన్ను లమ్మట; ఆనంద = సంతోషముతో కూడిన; బాష్ప = కన్నీటి; కణములున్ = బిందువులు; తొరగన్ = కారుతుండగా; క్రన్నన = శీఘ్రముగ; కౌగిటన్ = కౌగిలిలో; ఇడి = తీసుకొని; ననున్ = నన్ను; కన్న = కన్నట్టి; అన్నలు = తండ్రులు; వచ్చిరి = వచ్చారు; అనుచున్ = అనుచు; కౌతుకము = వేడుకలు; ఒప్పన్ = కలుగగా.

భావము:

ఆ మాతృమూర్తి చన్నులు చేపాయి. కన్నుల్లో ఆనందాశ్రువులు జాలువారాయి. వారిని కౌగలించుకుని “నా కన్నబిడ్డలు వచ్చారు,” అని లాలించింది.