పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1160-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కనుఁగొనుము వీరె నీ నం
ను" లని జనయిత్రికడ ముదంబున వారి
న్నునిచిన నద్దేవకియును
పుత్త్రస్నేహ మోహలితాత్మకయై.

టీకా:

కనుగొనుము = చూడుము; వీరె = వీరలే; నీ = నీ యొక్క; నందనులు = కొడుకులు; అని = అని; జనయిత్రి = అమ్మ; కడన్ = దగ్గర; ముదంబునన్ = సంతోషముతో; వారిన్ = వారలను; ఉనిచినన్ = ఉంచగా; ఆ = ఆ; దేవకీదేవియును = దేవకీదేవి; ఘన = మిక్కుటమైన; పుత్ర = పుత్రు లందలి; స్నేహ = మైత్రి, ప్రీతి అను; మోహ = మోహముతో; కలిత = కూడుకొన్న; ఆత్మ = మనసు కలామె; ఐ = అయ్యి.

భావము:

“అమ్మా! ఇరిగో వీరే నీ బిడ్డలు చూడు” అంటూ ఆ బాలకులను తల్లి దేవకీదేవి ముందుకు తెచ్చాడు. ఆమెలో పుత్రవాత్సల్యం పొంగిపొరలింది.