పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1158-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొలుపుగ సుగతిం బొందఁగఁ
ల" రని హరి యానతిచ్చి రుణాన్వితుఁడై
లిచే ననుమతిఁ గొని వా
లఁ దోకొని వచ్చె నిద్ధరామండలికిన్.

టీకా:

పొలుపుగన్ = చక్కగా; సుగతిన్ = మోక్షమును; పొందగగలరు = పొందగలరు; అని = అని; హరి = కృష్ణుడు; ఆనతిచ్చి = చెప్పి; కరుణా = దయతో; ఆన్వితుడు = కూడినవాడు; ఐ = అయ్యి; బలి = బలిచక్రవర్తి; చేన్ = చేత; అనుమతిన్ = అనుమతి; కొని = తీసుకొని; వారలన్ = వారిని; తోకొని = కూడ తీసుకుని; వచ్చెన్ = వచ్చెను; ఈ = ఈ; ధరామండలి = భూమండలమున; కిన్ = కు.

భావము:

తదుపరి, నా అనుగ్రహం వలన వీరికి సుగతి ప్రాప్తిస్తుంది.” ఈవిధంగా పలికి కరుణామయుడైన కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకీతనయులను తమ కూడా తీసుకుని వచ్చాడు.