పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1141-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియెన్ దానవుఁ, డింద్రసేనుఁడు దళత్కంజాక్షులన్, దక్షులన్,
సారాంబుదవర్ణులన్, నిఖిలలోకైకప్రభాపూర్ణులం,
రారన్ హలచక్రపాణులను, భక్తత్రాణులన్, నిత్యశో
వర్ధిష్ణుల, రామకృష్ణుల, జయభ్రాజిష్ణులన్, జిష్ణులన్.

టీకా:

కనియెన్ = చూసెను; దానవుడు = దనుపుత్రుడు, బలి {దానవుడు - దనువునందు కశ్యపునకు పుట్టినవాడు, బలి}; ఇంద్రసేనుడు = బలిచక్రవర్తి; దళత్ = వికసించిన; కంజా = పద్మములవంటి; అక్షులన్ = కన్నులు కలవారిని; దక్షులన్ = సమర్థులను; ఘనసార = కర్పూరము వంటి; అంబుద = మేఘము వంటి; వర్ణులన్ = దేహఛాయలు కలవారిని; నిఖిల = సర్వ; లోక = లోకములకు; ఏక = ముఖ్యమైన; ప్రభా = కాంతులుతో; ఆపూర్ణులన్ = నిండుగా ఉన్నవారిని; తనరారన్ = ఉన్నతమైన; హల = నాగలి ఆయుధము; చక్ర = చక్రాయుధము; పాణులన్ = చేతులలో కలవారిని; భక్త = భక్తులను; త్రాణులన్ = కాపాడువారిని; నిత్య = శాశ్వతమైన; శోభన = మేలుచేత; వర్ధిష్ణులను = వృద్ధి చెందు శీలము వారిని; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణులను; జయ = గెలుపులచే; భ్రాజిష్ణులన్ = ప్రకాశించు శీలురను; జిష్ణులన్ = జయించు శీలురను.

భావము:

సుతలలోక నివాసి ఐన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి వికసించిన పద్మాలవంటి కన్నుల కలవారు, భక్తులను రక్షించేవారు, శాశ్వతమైన మేళ్ళు ఒనగూర్చు వారు, జయశీలురు, ప్రభాశీలురు అయిన బలకృష్ణులను; హలధరుడు, పచ్చకర్పూరం వంటి ఛాయ కల వాడు అయిన బలరాముడిని; చక్రధారి, నీలమేఘశ్యాముడు అయిన కృష్ణుడిని వస్తుండగా చూసాడు.