పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1137-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వనీశ! యొక్కనాఁ డానకదుందుఖి-
భార్య పద్మాక్షుండు లుఁడుఁ దొల్లి
ధిలోఁ జొచ్చిన గురుతనూభవునిని-
రలంగఁ దెచ్చిన హిమ లెల్ల
నములు దమలోన న్నుతుల్‌ సేయంగ-
విని తన సుతులు దుర్వృత్తుఁడైన
కంసుచే నిహతులై కాలునిపురి నున్న-
వారి నందఱఁ జూడఁ గోరి కృష్ణ

10.2-1137.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లులకడ కేగి కన్నుల బాష్పకణము
లొలుక "నో రామ! రామ! నిత్యోన్నతాత్మ!
మపావనమూర్తి! యో మువిభేది!
యిందిరానాథ! యోగీశ్వరేశ! కృష్ణ!

టీకా:

అవనీశ = రాజా; ఒక్క = ఒకానొక; నాడు = రోజు; ఆనకదుందుభిభార్య = దేవకీదేవి {ఆనకదుందుభిభార్య - వసుదేవుని భార్య, దేవకి}; పద్మాక్షుండు = కృష్ణుడు; బలుడున్ = బలరాముడు; తొల్లి = మునుపు; శరధి = సముద్రమునందు; చొచ్చినన్ = మునిగిపోయిన; గురు = గురువు యొక్క; తనూభవునిని = పుత్రుని; మరలన్ = తిరిగి; తెచ్చిన = తీసుకువచ్చిన; మహిమలున్ = మహిమలను; ఎల్లన్ = అన్నిటిని; జనములు = ప్రజలు; తమలోన = వారిలోవారు; సన్నుతుల్ = స్తోత్రములు; చేయంగన్ = చేస్తుండగా; విని = విని; తన = తన యొక్క; సుతులు = పుత్రులు; దుర్వృత్తుడు = దుర్మార్గుడు; ఐన = అయిన; కంసు = కంసుని; చేన్ = చేత; నిహతులు = చంపబడినవారు; ఐ = అయ్యి; కాలుని = యముని; పురిన్ = పట్టణమున; ఉన్న = ఉన్నట్టి; వారిన్ = వారిని; అందఱన్ = అందరిని; చూడన్ = చూడవలెనని; కోరి = అపేక్షించి; కృష్ణ = కృష్ణుడు; బలులు = బలరాముడు ల; కడ = వద్ద; కున్ = కు; ఏగి = వెళ్ళి.
కన్నులన్ = కన్ను లమ్మట; బాష్ప = కన్నీటి; కణములు = బిందువులు; ఒలుకన్ = కారుతుండగా; ఓ = ఓయీ; రామ = బలరాముడ; రామ = బలరాముడ; నిత్య = శాశ్వతమైన; ఉన్నత = గొప్ప; ఆత్మ = మనసు కలవాడా; పరమ = మిక్కిలి; పావన = పుణ్య; మూర్తి = స్వరూపుడా; ఓ = ఓయీ; మురవిభేది = కృష్ణా {మురవిభేది - మురాసురుని సంహరించినవాడు, కృష్ణుడు}; ఇందిరానాథ = కృష్ణా {ఇందిరానాథుడు - లక్ష్మీపతి, విష్ణువు}; యోగీశ్వరేశ = కృష్ణా {యోగీశ్వరేశుడు - ముని ఉత్తముల ప్రభువు, విష్ణువు}; కృష్ణ = కృష్ణా {కృష్ణుడు - నల్లనివాడు, భక్తులను ఆకర్షించువాడు}.

భావము:

ఇంతక్రితం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుడిని మళ్ళీ తెచ్చి ఇచ్చిన విషయం ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా, వసుదేవుడి భార్య దేవకీదేవి విన్నది. కంసునిచేత వధింపబడి యముని సదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలని అమె మనసులో కోరిక బలపడింది. అమె బలరామ కృష్ణుల దగ్గరకు వెళ్ళి కన్నీరు కారుస్తూ “ఓ రామా! ఓ కృష్ణా! పరమోన్నతాత్ములారా! పరమ పావన మూర్తులారా! మురాసుర సంహారీ! శ్రీపతి! యోగీశ్వరేశ్వర!” అంటూ వారిని పలువిధాలుగా ప్రస్తుతించింది.