పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : జాంబవతి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-73-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డోలాయిత మానసులై
జాలింబడి జనులు గొలువఁ జండిక పలికెన్
"బాలామణితో మణితో
హేలాగతి వచ్చు నంబుజేక్షణుఁ" డనుచున్.

టీకా:

డోలాయిత = ఊగిసలాడుతున్న; మానసలు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; జాలిన్ = విచారమును; పడి = పొంది; జనులున్ = పౌరులు; కొలువన్ = పూజించగా; చండిక = దుర్గాదేవి {చండిక - చండుడను దనుజుని సంహరించిన దేవి, పార్వతి శరీరమునుండి పుట్టిన దేవి, దుర్గ}; పలికెన్ = పలికెను; బాలా = కన్యకలలో; మణి = ఉత్తమురాలు; తోన్ = తోటి; మణి = శమంతకమణి; తోన్ = తోటి; హేలా = ఒయ్యారపు; గతిన్ = గమనముతో; వచ్చున్ = వస్తాడు; అంబుజాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; అనుచున్ = అని.

భావము:

ప్రజలు ఇలా సంశయాత్మకులై దీనంగా ప్రార్థించగా “మణితో, బాలామణితో పద్మాక్షుడు అనాయాసంగా తిరిగి వస్తా”డని దుర్గాదేవి పలికింది.