పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : జాంబవతి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-70-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఈ ణి మాచేఁ బడె నని
తాసు లొనరించు నింద ప్పెడు కొఱకై
నీ మందిర మగు బిలమున
కే రుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే! "

టీకా:

ఈ = ఈ యొక్క; మణి = రత్నము; మా = మా యొక్క; చేబడెను = చేత గ్రహింపబడెను; అని = అని; తామసులు = అఙ్ఞానులు; ఒనరించు = చేసెడి; నిందన్ = నిందను; తప్పెడు = తొలగించుట; కొఱకై = కోసము; నీ = నీ యొక్క; మందిరము = నివాసము; అగు = ఐన; బిలమున్ = గుహ; కున్ = కు; ఏము = మేము; అరుదెంచితిమి = వచ్చితిమి; భల్లూకేశ్వర = జాంబవంతుడా {భల్లూకేశ్వరుడు - భల్లూకముల (ఎలుగుబంట్ల)కు ప్రభువు, జాంబవంతుడు}; వింటే = వినుము.

భావము:

“ఓ భల్లూకరాజా! ఈ శమంతకమణిని నేను అపహరించాను అని అజ్ఞానులు నాపై అపనింద వేసారు. దానిని తొలగించుకోవడానికి నీ మందిరమైన ఈ గుహకు నేను వచ్చాను.”