పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వసుదేవుని గ్రతువు

  •  
  •  
  •  

10.2-1135-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రమున నచ్చటఁ బ్రావృ
ట్సయం బగుటయును బంధున యాదవ వ
ర్గము లోలిఁ గొలువ సురగణ
మితులు బలకృష్ణు లాత్మగరంబునకున్.

టీకా:

క్రమమునన్ = వరుసగా; అచ్చట = అక్కడ; ప్రావృట్సమయంబు = వర్షాకాలము; అగుటయునున్ = రాగా; బంధు = బంధువుల; జన = సమూహములు; యాదవ = యాదవుల; వర్గములు = సమూహములు; ఓలిన్ = క్రమముగా; కొలువన్ = సేవించుచుండగా; సుర = దేవతల; గణ = సమూహములచే; నమితులు = నమస్కరింపబడువారు; బల = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; ఆత్మ = తన; నగరంబున = పట్టణమున; కున్ = కు.

భావము:

ఇలా శ్యమంతకపంచకంలో ఉండగా వర్షాకాలం వచ్చింది. బంధువులు పరివారం సేవిస్తూ ఉండగా, దేవతలచే సైతము కొలువబడువారు అయిన బలరామకృష్ణులు తమ ద్వారకానగరం చేరుకున్నారు.