పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వసుదేవుని గ్రతువు

  •  
  •  
  •  

10.2-1128-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడు న వ్వసుదేవుఁడు
మునివరులకు ననియె వినయమున "మీరలు సె
ప్పి యట్లు మఖము సేసెద
దికరనిభులార! మీరు దీర్పఁగవలయున్!"

టీకా:

అనవుడన్ = అని చెప్పగా; ఆ = ఆ; వసుదేవుడున్ = వసుదేవుడు; ముని = ఋషి; వరుల్ = ఉత్తముల; కున్ = కు; అనియె = చెప్పెను; వినయమునన్ = వినయముతో; మీరలు = మీరు; చెప్పిన = చెప్పిన; అట్ల = ఆ విధముగానే; మఖము = యాగమును; చేసెదన్ = చేస్తాను; దినకర = సూర్యుని; నిభులారా = సరిపోలిన వారలూ; మీరున్ = మీరు; తీర్పగవలయున్ = చక్కబరచవలెను.

భావము:

ఈవిధంగా వివరించిన మహర్షులు మాటలు విని, వసుదేవుడు వారితో ఇలా అన్నాడు. “తేజోనిధులైన ఓ మహర్షులారా! మీరు ఉపదేశించిన ప్రకారం యాగం చేస్తాను. దానిని మీరే ఋత్విజులై జరిపించాలి. అని వినయంగా వారికి మనవి చేసాడు.