పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వసుదేవుని గ్రతువు

  •  
  •  
  •  

10.2-1125-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేర్షి పితృ ఋణంబులు
భూర! మఖ వేదపాఠ పుత్రులచేతన్
వావిరి నీఁగని పురుషుఁడు
పోవు నధోలోకమునకుఁ బుణ్యచ్యుతుఁడై.

టీకా:

దేవ = దేవతల {ఋణత్రయము - 1దేవఋణము 2ఋషిఋణము 3పితౄఋణము}; ఋషి = ఋషుల; పితృ = పితృదేవతల; ఋణంబులున్ = ఋణములు; భూవర = రాజా; మఖ = యజ్ఞములు; వేదపాఠ = వేదములు చదువుట; పుత్రుల = కొడుకులను కనుట; చేతన్ = వలన; వావిరిన్ = క్రమముగా; ఈగని = తీర్చని; పురుషుడు = మానవుడు; పోవున్ = పోవును; అధోలోకమున = నరకమున; కున్ = కు; పుణ్య = చేసిన పుణ్యములు; చ్యుతుడు = జారిపోయిన వాడు; ఐ = అయ్యి.

భావము:

ఓ వసుదేవా! యజ్ఞాలు చేసి దేవతలఋణం; వేదాధ్యయనం చేసి ఋషిఋణం; పుత్రుని వలన పితృఋణం తీర్చుకోవాలి; ఇలా ఈ ఋణత్రయాన్ని తీర్చలేని మానవుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి పోతాడు.